
విళ్లివాకం న్యూస్ : తెలుగు బ్రాహ్మణ మహాసభ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుక, శ్రీ త్యాగరాజ దినోత్సవం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. దీనికి చెన్నై టి.నగర్ లో గల శ్రీ శారదా విద్యాలయా ప్రాంగణంలో లోని శారద శ్రైన్ వేదికయింది. ముందుగా గణపతి పూజ జరిగింది. తెలుగు బ్రాహ్మణ సభ అధ్యక్షులు గోటేటి వెంకటేశ్వరరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ జాయింట్ కమీషనర్ మంగపతి వివేకానందన్ విచ్చేశారు. బ్రహ్మశ్రీ దర్బాకుల కుమారశర్మ, పరేశ్ బాబా, త్రికూటం సత్యమూర్తి, డాక్టర్ వెంకట నాగరాజన్ ఉగాది పురస్కారాలను అందుకున్నారు. చిన్నారుల భరతనాట్యం అలరించింది. కార్యక్రమంలో ఫణిశర్మ పంచాంగ శ్రవణం జరిగింది.
తెలుగు బ్రాహ్మణ సభ నిర్వాహకులు ఎస్ జయరామన్, టి.శంకర్, ఎల్ సాయినాధ్, పిఎల్ఎన్ రఘుకుమార్ ప్రభాకర్, బాలాజీ, నగర ప్రముఖులు పాల్గొన్నారు.