శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు

విళ్లివాకం న్యూస్: శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో ‘శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సంబరాలు’ గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. దీనికి చెన్నై కొరట్టూరు అగ్రహారం లో గల శ్రీ కోదండ రామాలయం కమ్యూనిటీ హాల్ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు ఎట్టయపురం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చాన్సులర్ వి రామచంద్రన్ విచ్చేశారు. విశిష్ట అతిధులుగా ఆదర్శ్ షిప్పింగ్ అండ్ సర్వీసెస్ డైరెక్టర్ డి దేవేంద్రన్, పిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ పి ముత్తువేల్ రాజ్, ఇకాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శోభారాజా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఫోక్ డాన్స్ మ్యూజిక్ అండ్ వెల్కమ్ డాన్స్, శ్రీ వెంకటేశ్వర ప్రైమరీ విద్యాలయం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 10 వ తరగతి , 12వ తరగతి మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జేయం నాయుడు, ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు హరినాథ్, ఉపాధ్యక్షురాలు పి సరస్వతి, ఉపాధ్యక్షులు కేఎన్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి