చెన్నైలో పొట్టి శ్రీరాములు స్మారక మందిరాన్ని సందర్శించిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్

చెన్నై న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు నేడు చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పొట్టి శ్రీరాములు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
సందర్శన సందర్భంగా స్మారక మందిరానికి సంబంధించిన వివరాలను మంత్రి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని పరిశీలించి, అందులో ఉన్న సాహిత్య సంపదను చూసి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా స్మారక మందిర నిర్వహణకు సంబంధించి నిధుల కొరత ఉన్న విషయాన్ని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. ప్రభుత్వ సహకారం అందించి మందిరం సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ చైర్మన్ కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వూరా శశికళ, సభ్యురాలు డాక్టర్ ఏ.వి. శివకుమారి కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, చంద్రశేఖర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి