
న్యూఢిల్లీ: హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాల నుంచి ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులకు షెడ్యూల్డ్ కులాల (SC) హోదా వర్తించదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2026 మార్చిలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
క్రైస్తవ మతంలోకి లేదా ఇతర మతాల్లోకి మారిన తర్వాత ఎస్సీ హోదా, రిజర్వేషన్ ప్రయోజనాలు లేదా కుల ధ్రువీకరణ పత్రం కొనసాగదని కోర్టు పేర్కొంది. మత మార్పిడితో ఎస్సీ హోదా స్వయంచాలకంగా రద్దవుతుందని గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
అలాగే, ఎస్సీ హోదా తిరిగి పొందాలంటే చట్టంలో పేర్కొన్న నిబంధనలు, షరతులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు యథాతథంగా సమర్థించింది.