మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్ విజేత!

చెన్నై న్యూస్: భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది! వన్డే క్రికెట్‌లో తొలిసారిగా ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుని, దేశాన్ని గర్వపడేలా చేసింది.

ముంబైలో జరిగిన ఫైనల్‌లో భారత్‌ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. జవాబులో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

భారత బౌలర్లలో దీప్తి శర్మ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆమె తన స్పిన్ మాయతో 5 వికెట్లు తీయడం ద్వారా మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించింది. షెఫాలీ వర్మ 2 వికెట్లు తీసి బౌలింగ్‌లో మెరిపించగా, శ్రీ చరణి ఒక వికెట్ సాధించింది.

బ్యాటింగ్‌లో కూడా షెఫాలీ వర్మ సత్తా చాటింది. కేవలం 78 బంతుల్లోనే 87 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీప్తి శర్మ 58 బంతుల్లో 58 పరుగులు చేసి అద్భుత హాఫ్ సెంచరీ సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన 45 పరుగులతో సహకరించింది.

47 ఏళ్ల మహిళల వన్డే చరిత్రలో ఇదే భారత జట్టు తొలి వరల్డ్ కప్ విజయం. 2005, 2017 ఫైనల్స్‌లో ఓటమి చవిచూసిన భారత్‌, ఈసారి ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరి విజేతగా నిలిచి తన కలను నిజం చేసుకుంది.

 

టీమిండియా మహిళల ఈ విజయం దేశవ్యాప్తంగా సంబరాలు రేపుతోంది. క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు.
……………

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి