మాగుంట కుటుంబంలో విషాదం

ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యురాలు దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి సతీమణి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు అనారోగ్య కారణంగా ఈ రోజు ఉదయం గం. 06:15 లకు చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో లో చికిత్స పొందుతూ మరణించినారు… చెన్నై న్యూస్.

మాజీ పార్లమెంటు సభ్యులు , ప్రముఖ వ్యాపార వేత్త స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారి సతీమణి , పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారి వదిన మాగుంట పార్వతమ్మ (77) సెప్టెంబర్ 25 తెల్లవారుఝామున చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఈ ఉదయం ఆమె కన్ను మూసారు.
పార్లమెంటు సభ్యురాలిగా , శాసన సభ్యురాలిగా పార్వతమ్మ పలు హోదాలలో ప్రజలకి తమ సేవలందించారు. మాగుంట సుబ్బరామరెడ్డి దివంగతులైన తరువాత 1996లో తొలిసారిగా ఆమె రాజకీయ రంగప్రవేశం చేసి లోక్ సభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆ తరువాత 2004లో ఆమె కావలి నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా ఎంపికయ్యారు.
అంత్యక్రియలు :
ఆమె పార్థివ దేహాన్ని ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకి నెల్లూరు , సరస్వతి నగర్ లోని ఆమె స్వగృహానికి తీసుకురానున్నారు.
అభిమానుల సందర్శనార్ధం రేపు అంటే సెప్టెంబర్ 26 వ తేదీ మధ్యాహ్నం వరకు వారి స్వగృహంలో ఉంచుతారు.
గురువారం సాయంత్రం 3గంటలకి అక్కడి నుండి వారి అంతిమయాత్ర బయలుదేరుతుందని “మాగుంట కుటుంబసభ్యులు” తెలిపారు.
…………….

 

Spread the love

One Response

  1. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని
    తెలియజేస్తున్నాను.

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి