
ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యురాలు దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి సతీమణి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు అనారోగ్య కారణంగా ఈ రోజు ఉదయం గం. 06:15 లకు చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో లో చికిత్స పొందుతూ మరణించినారు… చెన్నై న్యూస్.
మాజీ పార్లమెంటు సభ్యులు , ప్రముఖ వ్యాపార వేత్త స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారి సతీమణి , పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారి వదిన మాగుంట పార్వతమ్మ (77) సెప్టెంబర్ 25 తెల్లవారుఝామున చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఈ ఉదయం ఆమె కన్ను మూసారు.
పార్లమెంటు సభ్యురాలిగా , శాసన సభ్యురాలిగా పార్వతమ్మ పలు హోదాలలో ప్రజలకి తమ సేవలందించారు. మాగుంట సుబ్బరామరెడ్డి దివంగతులైన తరువాత 1996లో తొలిసారిగా ఆమె రాజకీయ రంగప్రవేశం చేసి లోక్ సభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆ తరువాత 2004లో ఆమె కావలి నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా ఎంపికయ్యారు.
అంత్యక్రియలు :
ఆమె పార్థివ దేహాన్ని ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకి నెల్లూరు , సరస్వతి నగర్ లోని ఆమె స్వగృహానికి తీసుకురానున్నారు.
అభిమానుల సందర్శనార్ధం రేపు అంటే సెప్టెంబర్ 26 వ తేదీ మధ్యాహ్నం వరకు వారి స్వగృహంలో ఉంచుతారు.
గురువారం సాయంత్రం 3గంటలకి అక్కడి నుండి వారి అంతిమయాత్ర బయలుదేరుతుందని “మాగుంట కుటుంబసభ్యులు” తెలిపారు.
…………….
One Response
మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని
తెలియజేస్తున్నాను.