సభలో విపక్షాలు సమయాన్ని వృధా చేస్తున్నాయ్‌

సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకునే యత్నాలు

బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలని ఆకాంక్ష : మోడీ

కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే సర్కార్‌ తొలి బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విూడియాతో మాట్లాడారు. పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేస్తున్నాయని ఆయన విమర్శించారు.’నేను 

బరువెక్కిన హృదయంతో చెబుతున్నా… కొందరు ఎంపీలు, ఇతరులను తమ నియోజకవర్గ సమస్యలపై సభలో మాట్లాడే సమయం ఇవ్వకుండా చేస్తున్నారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలి. సభలో నిరసనలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నించారని మోదీ అన్నారు. ఇదివరకు జరిగిన సభల్లో రెండున్నర గంటలు నాపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాల్లో ఇలాంటి వ్యాఖ్యలకు తావుండదు. వీటన్నింటినీ దేశం నిశితంగా పరిశీలిస్తోంది. విపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి. కనీసం ఈ సమావేశాలైనా సజావుగా సాగుతాయని ఆశిస్తున్నా. 2014 తర్వాత కొంతమంది ఎంపీలు ఒకసారి, మరికొందరు రెండోసారి గెలిచారని అన్నారు. కానీ.. విపక్షాల అరుపుల మధ్య వారిలో చాలా మంది వారి సమస్యలను సభాసాక్షిగా వినిపించలేకపోయారు. ఇక నుంచైనా సమావేశాలను సజావుగా సాగనిస్తూ.. ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించనివ్వండి. 60 సంవత్సరాల తరువాత వరుసగా మూడు సార్లు ఓ పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. మూడోసారి అధికారం చేపట్టాక తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నాం అని మోదీ వ్యాఖ్యానించారు. సుపరిపాలనకు ఈ బడ్జెట్‌ ముఖ్యమైనది. రాబోయే 5 ఏళ్లకు ఇది దిశానిర్దేశం చేస్తుంది. 2047 వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి బలమైన పునాది అవుతుంది. గత మూడేళ్లలో దేశం 8 శాతం ఆర్థిక వృద్ధిని సాధించింది. దేశంలో పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం ఉంది. అందుకు తగినట్లు వేల సంఖ్యలో కంపెనీలు భారత్‌కి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయ్‌. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నాయ్‌’ అని మోదీ పేర్కొన్నారు.

పిఎం నరేంద్ర మోడీ
Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి