కాంగ్రెస్‌ కుట్రలు గోదావరిలో కొట్టుకు పోయాయి

కాళేశ్వరం సగర్వంగా సలాం చేస్తోంది: కెటిఆర్‌ ట్వీట్‌

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కాంగ్రెస్‌ కుట్రలే కొట్టుకుపోయాయని.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద పోటెత్తుతున్నది. మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. దీనిపై అధికార కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్‌ ఆ పార్టీకి ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఆ పార్టీ సర్కారుకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. పోటెత్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలే పటాపంచలయ్యాయన్నారు. కేసీఆర్‌ సమున్నత సంకల్పం.. జై కొడుతోంది.. జల హారతి పడుతోందని పేర్కొన్నారు. లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో లక్షకోట్లు వృధా చేశారనే విమర్శలే గల్లంతయ్యాయన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మాత్రం.. మొక్కవోని దీక్షతో నిలబడిరదన్నారు. కొండంత బలాన్ని చాటిచెబుతోందని పేర్కొన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా.. దశాబ్దాలుగా దగాపడ్డ.. ఈ తెలంగాణ నేలకు ఇప్పటికీ.. ఎప్పటికీ.. మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే ’మేటి’గడ్డ అన్నారు. కాళేశ్వరమే కరువును పారదోలే ’కల్పతరువు’ అని తెలిపారు. బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన ఈ మానవ నిర్మిత అద్భుతానికి. కేసీఆర్‌ సర్‌కు తెలంగాణ సమాజం పక్షాన మరోసారి సెల్యూట్‌’ అంటూ ట్వీట్‌ చేసిన కేటీఆర్‌.. ఈ సందర్భంగా గోదావరిలో వరదకు సంబంధించిన వీడియోను సైతం జతం చేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి