ఇదే సభలో కులగణన బిల్లు ఆమోదిస్తాం

అనురాగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలపై రాహల్‌ సవాల్‌

ఠాకూర్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందన

 ఇదే సభలో కులగణన బిల్లును ఆమోదించి చూపుతామని ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ మంగళవారం ప్రకటించారు. లోక్‌ సభలో బిజెపి ఎంపీ అనురాగ్‌ ఠాకుర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనను అవమానించారని మండిపడ్డారు. అనురాగ్‌ ఠాకుర్‌ ‘ఎవరికైతే తమ కులం కూడా తెలియదో వారు కుల గణన గురించి మాట్లాడుతున్నారని అన్నారు. దీనిపై రాహుల్‌ గాంధీ స్పందిస్తూ ఎవరైతే ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వారికి సంబంధించిన సమస్యలు లేవనెత్తుతారో వారిని కించపరుస్తున్నారని అన్నారు. కులం తెలియని వారు కూడా కుల గణన గురించి మాట్లాడుతున్నారు. ఈ సభలోనే మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ రిజర్వేషన్‌ను వ్యతిరేకించారని నేను స్పీకర్‌కు గుర్తు చేయాలనుకుంటున్నాను అని బిజెపి ఎంపి అనురాగ్‌ ఠాకూర్‌ సభలో అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని దేశానికి హావిూ ఇచ్చిన రాహుల్‌ గాంధీ తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. విూరు ఎంత కావాలనుకుంటే అంతగా నన్ను అవమానించవచ్చు, కానీ మేము పార్లమెంటులో కుల గణనను పాస్‌ చేస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు. తర్వాత ఠాకూర్‌ తన వ్యాఖ్యల్లో ఎవరి పేరును ప్రస్తావించలేదని చెప్పారు. కులం గురించి తెలియని వ్యక్తి కుల గణన గురించి మాట్లాడుతున్నారని నేను అన్నాను, కానీ నేను ఎవరి పేరు ప్రస్తావించలేదని అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. కానీ తర్వాత రాహుల్‌ గాంధీ , ఠాకూర్‌ తనను దుర్భాషలాడారని, అవమానించారని 

ఆరోపించారు. అయితే ఆయన నుంచి తాను క్షమాపణలు కోరుకోవడం లేదన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన హావిూల్లో కుల గణన ఒకటి. ఎన్నికలకు ముందు రాహుల్‌ గాంధీ దీనిని భారతదేశం యొక్క ఎక్స్‌`రే అని పిలిచారు. దేశంలో ఎంత మంది వెనుకబడినవారు, దళితులు, గిరిజనులు ఉన్నారో ఎవరికీ తెలియదా? జనాభాలో అత్యధికంగా ఉన్న వారికి వారి సంఖ్య తెలియదు. బిజెపి ప్రభుత్వానికి కులాల డేటా అక్కర్లేదు. కానీ వివిధ కుల సమూహాల జనాభాను నిర్దారించడానికి మేము భారతదేశం యొక్క ఎక్స్‌`రేను పొందుతాము. కుల గణన పూర్తయితే దేశం మారిపోతుంది’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. కాగా కుల ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని బిజెపి ఆరోపించింది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి