తిరుమలకు పాదయాత్ర ప్రారంభం

విల్లివాకం న్యూస్: చెన్నై, పెరంబూర్, పటేల్ రోడ్డులో గల శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్ర ఆదివారం ఆనంద నిలయం నుంచి ప్రారంభమయింది. 47వ సంవత్సరంగా ఏర్పాటైన ఈ పాదయాత్ర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త జంబు పాల్గొని ప్రారంభించారు. ప్రత్యేక అతిథులుగా పుదుచ్చేరి ఎమ్మెల్యే శివశంకర్, పారిశ్రామికవేత్త కిల్లి వళవన్ పాల్గొన్నారు. ఈ పాదయాత్ర రెడ్ హిల్స్, పెరియపాలయం, ఊత్తుకోట, సురుటుపల్లి నాగలాపురం, నారాయణవనం, పుత్తూరు, తిరుచానూరు మీదుగా సాగి తిరుమల 17వ తేదీ ఉదయానికి చేరుకుంటుంది. ఈ పాదయాత్రలో సమాజం అధ్యక్షులు తమ్మినేని బాబు, కార్యదర్శి ఎస్ వెంకట్రామన్, సహకార్యదర్శి హెచ్ అనంతరామన్, కోశాధికారి పి కోదండరామన్, ట్రస్టీ పి రామచంద్రన్ సహా దాదాపు మహిళలు, పురుషులు 300 మంది పాల్గొన్నారు. అలాగే పాండిచ్చేరికి చెందిన భక్తులు పదిమంది పాల్గొన్నారు.

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి