తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి తిరుమల దేవస్థానం (టిటిడి) భక్తుల కోసం ఉచిత దర్శన టోకెన్లను అందుబాటులోకి తీసుకురావడంతో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. వేలాది మంది భక్తులు టోకెన్లు పొందడానికి చేరుకోవడంతో రద్దీ తీవ్రతకు కారణమైంది.

ఈ భక్తుల తాకిడి క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుని, సేలంకు చెందిన మల్లిక అనే మహిళతో పాటు ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో కొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. టిటిడి అధికారులతో చర్చించి, బాధితులకు అత్యవసర వైద్యం అందించడంతో పాటు కుటుంబాలకు అవసరమైన సాయం అందించాలని ఆదేశించారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు.

ఈ ఘటన భక్తుల్లో తీవ్ర విషాదం నింపింది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి