తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి తిరుమల దేవస్థానం (టిటిడి) భక్తుల కోసం ఉచిత దర్శన టోకెన్లను అందుబాటులోకి తీసుకురావడంతో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. వేలాది మంది భక్తులు టోకెన్లు పొందడానికి చేరుకోవడంతో రద్దీ తీవ్రతకు కారణమైంది.

ఈ భక్తుల తాకిడి క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుని, సేలంకు చెందిన మల్లిక అనే మహిళతో పాటు ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో కొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. టిటిడి అధికారులతో చర్చించి, బాధితులకు అత్యవసర వైద్యం అందించడంతో పాటు కుటుంబాలకు అవసరమైన సాయం అందించాలని ఆదేశించారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు.

ఈ ఘటన భక్తుల్లో తీవ్ర విషాదం నింపింది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి