
విల్లివాకం న్యూస్ : ఈసిఐ, గాంధీనగర్ తెలుగు చర్చిలో ఆదివారం సిస్టర్ ఫెయిత్ (సింగపూర్) తన సాక్షాన్ని పంచుకున్నారు. డాక్టర్ నీల సువర్ణ హగ్గయి 2:5 ఆధారంగా దైవ సందేశాన్ని వినిపించారు. అలాగే, ఈసీఐ సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ ఎబెల్ నీలకంఠన్ ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులను చర్చి తరఫున సత్కరించారు.
గత ఏడాది స్త్రీల సమాజం కమిటీ తరపున సంఘములోని ప్రతి కుటుంబానికి బహుమతులను అందజేశారు. అలాగే నూతన స్త్రీల సమాజ కమిటీకి బాధ్యతలను అప్పగించారు. ఈ ప్రత్యేక ఆరాధనలో దేశ క్షేమం, కుటుంబాల ఆశీర్వాదం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఓ తిమోతి, సంఘ పెద్దలు, కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, యవనస్తులు పాల్గొన్నారు.