ప్రముఖ గాయని పి సుశీలకు అస్వస్థత..

చెన్నై న్యూస్ :ప్రముఖ గాయని పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చెన్నైలోని ఆళ్వార్‌పేటలోనికావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబసభ్యుల తెలిపిన వివరాల ప్రకారం..
గత కొంతకాలంగా సుశీల తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. శనివారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో భయాందోళన చెందిన కుటుంబసభ్యులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. దీంతో సుశీల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలో శుక్రవారం రాత్రి వరలక్ష్మీ వ్రతం పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సుశీల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిల్, కన్నడ, మళయాలం ఇలా అన్ని భాషల్లో రాణించారు. 2008లో ఆమెను భారత ప్రభుత్వం ప్రద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతోపాటు సుశీల కెరీర్​లో ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

Spread the love

2 Responses

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి