ఉచిత కంటి పరీక్షల శిబిరానికి అనూహ్య స్పందన

విళ్లివాకం న్యూస్: చెన్నై, పెరంబూరు పటేల్ రోడ్డులో గల శ్రీ వేంకటేశ్వర భక్త సమాజం, ఆళ్వారు పేట, ఉది కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం ఆదివారం ఉదయం ఆనంద నిలయం వేదికగా జరిగింది. దీనిని ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త డి. జంబు దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దాదాపు 300 మందికి పరీక్షలు జరిపారు. 200 మందికి ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు.

అలాగే, అవసరమైన వారికి ఆస్పత్రిలో చేర్చి వెంటనే ఆపరేషన్లకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తమ్మినేని బాబు, కార్యదర్శి ఎస్ వెంకట్రామన్, ట్రెజరర్ హెచ్ వెంకట రమణుడు, సహాయ కార్యదర్శి పి రవి కుమార్, ట్రస్టీ పి రామచంద్రన్ తదితర కార్యవర్గ సభ్యులందరూ, జనని కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య పాల్గొన్నారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి