నమక్కల్: లారీ-బస్సు ఢీ – ముగ్గురు మృతి, 10 మందికి పైగా గాయాలు

గిండి న్యూస్ :నమక్కల్ జిల్లా మెటాల సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మెటళ్ల కొరియాట్టు వంతెనపై వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో లారీ డ్రైవర్‌, బస్సు డ్రైవర్‌, ఒక మహిళ అక్కడికక్కడే మరణించారు. 10 మందికి పైగా వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడినవారిని రాశిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎక్కువగా గాయపడిన బాధితులను మంత్రి మదివేంధన్ ఆసుపత్రిలో స్వయంగా కలుసుకుని, వారికి అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి