
కోడంబాకం న్యూస్: తమిళనాడు ముఖ్యమంత్రి, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత విజయ్ నటించిన ‘జననాయగన్’ చిత్రం ఈ రోజు (గురువారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అభిమానులలో భారీ అంచనాలు నెలకొనగా, సినిమా టిక్కెట్లు ఆన్లైన్లో వేగంగా అమ్ముడవుతున్నాయి.
రూ. 200 టికెట్… అకస్మాత్తుగా పెరిగిన ధర
తంజావూరు నగరంలోని నాలుగు థియేటర్లలో ‘జననాయగన్’ చిత్రం ప్రదర్శితమవుతోంది. అభిమానులు ఇప్పటికే ఈ సినిమా కోసం ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.
అయితే, తంజావూరులోని ఓ థియేటర్లో రూ. 200కు టిక్కెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు బుధవారం వాట్సాప్ ద్వారా ఒక సందేశం వచ్చినట్లు సమాచారం. అందులో టిక్కెట్ ధరను రూ. 700కు సవరించినట్లు పేర్కొంటూ, మిగిలిన మొత్తాన్ని QR కోడ్ ద్వారా చెల్లించాలని కోరారు.
అభిమానులకు దిగ్భ్రాంతి
ఇప్పటికే బుక్ చేసుకున్న టిక్కెట్లకు అదనపు మొత్తం చెల్లించాలని వచ్చిన ఈ హఠాత్ సమాచారం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సంబంధిత థియేటర్ తీరుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
………..