రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారపు మల్లిఖార్జున నియామకం

కాకినాడ, జూలై 20 : జైభీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా న్యాయవాది జగ్గారపు మల్లిఖార్జున ను నియమించారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున మాట్లాడుతూ గడిచిన ఆరు సంవత్సరాల నుండి పార్టీలో క్రమశిక్షణతో ఉండి, కాకినాడ జిల్లా అధ్యక్షునిగా, పార్టీ రాష్ట్ర వర్కింగ్ జనరల్ సెక్రెటరీగా ఇప్పటివరకూ పనిచేశానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున ప్రజా సమస్యలపై కోర్టులలో, ప్రజాక్షేత్రంలో నిరంతరం పోరాటాలు చేశామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వంపై కూడా పోరాడటానికి సిద్ధమని మల్లిఖార్జున తెలిపారు. ప్రజాక్షేత్రంలో ప్రజలే దేవుళ్ళనీ, ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ జైభీమ్ రావ్ భారత్ పార్టీ అనీ, ఇలాంటి పార్టీలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చిన అధ్యక్షులు శ్రావణ్ కుమార్ కి మల్లిఖార్జున ధన్యవాదాలు తెలిపారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి