ఎపి అసెంబ్లీలో ఆసక్తికర ఘటన

జగన్‌తో ఎమ్మెల్యే రఘురామ భేటీ

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్‌, తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మధ్య సంభాషణ జరిగింది. సమావేశాలు జరిగినన్ని రోజులూ సభకు రావాలని జగన్‌ను రఘురామ కోరగా.. హాజరవుతానని ఆయన బదులిచ్చారు. వాళ్లిద్దరూ ఇంకా ఏం మాట్లాడుకున్నారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో వైకాపా ఎంపీగా ఉంటూనే రఘురామ అప్పటి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వైకాపా ప్రభుత్వం, జగన్‌ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. ఈ క్రమంలో రఘురామ అరెస్ట్‌ తదితర పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో జగన్‌, రఘురామ ఏం మాట్లాడుకున్నారనేదానిపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్‌ను ఆయన ఛాంబర్‌లో భాజపా ఎమ్మెల్యేలు కలిశారు. చాలా మంది వైకాపా నేతలు భాజపా వైపు చూస్తున్నారనే అంశంపై వారి మధ్య కాసేపు చర్చ జరిగింది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆ పార్టీ నేతలు తెలిపారు. అలాంటిది ఏదైనా ఉంటే ఉమ్మడిగా నిర్ణయిద్దామని చెప్పారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి