ఆకట్టుకున్న చిత్రకళా ప్రదర్శన

విల్లివాకం న్యూస్: నగరంలో ఆర్ట్ ఆఫినిటీ పేరిట గ్రూప్ ఆర్ట్ షో ఆదివారం ఉదయం ప్రారంభమైంది. దీనికి చెన్నై గ్రీమ్స్ రోడ్డులో గల లలిత అకాడమీ హాలు వేదికయింది. ఇందులో గౌరవ అతిథులుగా సాయి ఆర్ట్స్ అధినేత, చిత్రకళారత్న ఇ. వేదాచలం, సినీ పబ్లిసిటీ డిజైనర్, సింధూర్ గ్రాఫిక్స్ అధినేత, చిత్రకళారత్న లిపిశిల్పి జి. అంకయ్య పాల్గొన్నారు.

ఈ ప్రదర్శనలో 69 మంది చిత్రకారులు వైవిద్య భరితమైన చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు ఇందులో ఆయిల్, అక్రైలిక్, అబ్ స్ట్రాక్ట్, రియలిజం, స్కల్ప్ చర్, వుడ్ కార్వింగ్ తదితరాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రదర్శనలో హైదరాబాదుకు చెందిన గాయత్రి, లక్ష్మీరేఖ, ఓరుగంటి సుజాత తమ చిత్రాలను ప్రదర్శించారు.

వీరు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఏర్పాటైన ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఇక్కడ 26 నుంచి 30 తేదీ వరకు ఇద్దరు చిత్రకారులు డెమో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనకు నగరవాసుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లను మోహనుడు, రవి, గాయత్రి రాజా చేపట్టారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి