ఆకట్టుకున్న చిత్రకళా ప్రదర్శన

విల్లివాకం న్యూస్: నగరంలో ఆర్ట్ ఆఫినిటీ పేరిట గ్రూప్ ఆర్ట్ షో ఆదివారం ఉదయం ప్రారంభమైంది. దీనికి చెన్నై గ్రీమ్స్ రోడ్డులో గల లలిత అకాడమీ హాలు వేదికయింది. ఇందులో గౌరవ అతిథులుగా సాయి ఆర్ట్స్ అధినేత, చిత్రకళారత్న ఇ. వేదాచలం, సినీ పబ్లిసిటీ డిజైనర్, సింధూర్ గ్రాఫిక్స్ అధినేత, చిత్రకళారత్న లిపిశిల్పి జి. అంకయ్య పాల్గొన్నారు.

ఈ ప్రదర్శనలో 69 మంది చిత్రకారులు వైవిద్య భరితమైన చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు ఇందులో ఆయిల్, అక్రైలిక్, అబ్ స్ట్రాక్ట్, రియలిజం, స్కల్ప్ చర్, వుడ్ కార్వింగ్ తదితరాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రదర్శనలో హైదరాబాదుకు చెందిన గాయత్రి, లక్ష్మీరేఖ, ఓరుగంటి సుజాత తమ చిత్రాలను ప్రదర్శించారు.

వీరు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఏర్పాటైన ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఇక్కడ 26 నుంచి 30 తేదీ వరకు ఇద్దరు చిత్రకారులు డెమో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనకు నగరవాసుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లను మోహనుడు, రవి, గాయత్రి రాజా చేపట్టారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి