HMPV మహమ్మారి ముప్పు: మాస్కులు ధరించండి, జాగ్రత్తలు పాటించండి!”

చెన్నై న్యూస్:కొన్ని సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన విధానం అందరికీ గుర్తుంది. చైనాలో ప్రారంభమైన ఆ వైరస్, ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మందిని ప్రభావితం చేసింది. ఇప్పుడు చైనాలో HMPV (Human Metapneumovirus) కేసులు పెరుగుతుండటంతో, అదే ముప్పు మళ్లీ మన దేశానికి రావచ్చనే భయం వ్యక్తమవుతోంది.

ఇటీవల బెంగళూరులో 8 నెలల చిన్నారి HMPV లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో, ఈ వైరస్ ఇప్పటికే మన దేశంలో అడుగుపెట్టినట్టే కనిపిస్తోంది. HMPV సంక్రమణ శ్వాస సంబంధిత సమస్యలు, జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలను కలిగిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్‌కు బలవుతారు.

జాగ్రత్తలు:

1. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించండి.

2. చేతులను సబ్బుతో మెలకువగా కడుక్కోవడం అలవాటు చేసుకోండి.

3. షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయండి.

4. పెద్ద సమూహాల్లో ఉండటం తగ్గించండి.

 

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించడం, సాధ్యమైనంత వరకు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడాన్ని తగ్గించడం ఎంతో ముఖ్యం. ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటిస్తే, మహమ్మారి ప్రభావాన్ని తగ్గించగలగుతాం.

హెల్త్ అనలిస్టుల హెచ్చరిక:
“ప్రపంచంలో ఎక్కడైనా మహమ్మారి పుట్టినప్పుడు, దాని ప్రభావం కేవలం గడచిన ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా, ఇతర దేశాలకు వ్యాప్తి చెందడం అనివార్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి,” అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మాస్కులు ధరించడం మళ్లీ మన జీవన శైలిలో భాగం కావాల్సిన సమయం ఆసన్నమైంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి