
చెన్నై న్యూస్ :చెన్నై తిరువళ్లికేణిలోని రామ్ నగర్ గ్రామ ఆది ఆంధ్ర సంక్షేమ సంఘం (పంచాయితీ) అధ్యక్షుడు మేక బాబు (ఎఫ్ సి ఐ లో పనిచేసి) పదవీ విరమణ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టామ్స్ మరియు మాస్ ఉపాధ్యక్షుడు పి. పాల్ కొండయ్య స్వాగతం పలుకుతూ, మేక బాబు సంఘ సేవలోను, ఉద్యోగ సేవలోను చేసిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా సంఘ సేవలో మరింతగా నిమగ్నమై ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
ముందుగా మేక బాబును ఘనంగా సత్కరించి నిర్వహించారు.
అనంతరం ఎం. శేఖర్, టీవీ వెంకటేష్, జాయింట్ సెక్రటరీలు రాజా, విజయ భాస్కర్, ట్రెజరర్ ఎం. పురుషోత్తం పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో ప్రధాన కార్యదర్శి పి.పీ. నరసింహన్ వందన సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తోటి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.