
విళ్లివాకం న్యూస్: చెన్నై తెలుగు అసోసియేషన్, వలసరవాక్కం ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం మధురవాయిల్ పూనమల్లి హైరోడ్డులో గల శ్రీ సీతాలక్ష్మి తిరుమణ మండపంలో శుక్రవారం ఉదయం ఘనంగా జరిగింది. సీతారామ కళ్యాణం శ్రీరామనవమి అత్యంత పవిత్రమైన, వైభవమైన వేడుకఅవుతుంది. శ్రీ రాముడు, సీతమ్మల వివాహం లోకానికి ఆదర్శవంతమైన, దైవికమైన బంధాన్ని చాటిచెబుతుంది. నేడు అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో ప్రెసిడెంట్ గోపాల కృష్ణారెడ్డి, సెక్రటరీ వెంకయ్య నాయుడు, ట్రెజరర్ నాగరాజ్, కల్చరల్ సెక్రటరీ డాక్టర్ ఏవి శివకుమారి, కమిటీ మెంబర్లు, సభ్యులతోపాటు 400 మందికి పైగా పాల్గొన్నారు.