ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డ్‌ రేసులో రోహిత్‌కు షాకిచ్చిన బుమ్రా

జూన్‌ 29న టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్‌ విజయంలో ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో బూమ్‌ బూమ్‌ బుమ్రాకు ఐసీసీ నుంచి అద్భుతమైన రిటర్న గిఫ్ట్‌ దక్కింది. బుమ్రా జూన్‌ 2024 కోసం ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డు కోసం బుమ్రా టీమిండియా సారథి రోహిత్‌ శర్మ, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రహ్మానుల్లా గుర్బాజ్‌లతో పోటీ పడ్డాడు. వీరిద్దరిని అధిగమించిన బుమ్రా ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 30 ఏళ్ల టీమిండియా పేసర్‌.. %ఖూA%, కరేబియన్‌లలో 8.26 సగటుతో 15 వికెట్లు పడగొట్టి, 4.17 ఎకానమీ రేటుతో అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. పురుషుల %ు%20 ప్రపంచ కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డులో విరాట్‌ కోహ్లీ (రెండుసార్లు విజేత)తో కలిసి భారత ఆటగాడిగా చేరాడు. ‘‘జూన్‌ నెలలో %Iజజ% పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా ఎంపికైనందుకు నేను సంతోషిస్తున్నాను. %ఖూA%, వెస్టిండీస్‌లో గడిపిన కొన్ని వారాల చిరస్మరణీయమైన రోజుల తర్వాత ఇది నాకు ప్రత్యేక గౌరవం. టోర్నమెంట్‌లో మేం బాగా ఆడడం, చివర్లో ట్రోఫీని ఎత్తడం చాలా ప్రత్యేకమైనది, నేను ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ నాతో ఉంచుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మహిళల విభాగంలో టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధాన జూన్‌ నెలకుగానూ ఐసీసీ ఉమెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును గెలుచుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన మైయా బౌచియర్‌, శ్రీలంకకు చెందిన విష్మి గుణరత్నేలను ఓడిరచిన, లేడీ విరాట్‌ అంతర్జాతీయ కెరీర్‌లో మొదటిసారి ఈ అవార్డును దక్కించుకుంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి