గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు 

ఐదురోజుల పాటు సమావేశాల నిర్వహణ

బిఎసి సమావేశంలో నిర్ణయం

సమావేశానికి వైకాపా గైర్హాజరు

గవర్నర్‌ను రాచమార్గంలో రప్పించామన్న స్పీకర్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ ప్రసంగం అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడిరది. అనంతరం స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం పూర్తయింది. ఈ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, విష్ణు కుమార్‌ రాజు హాజరయ్యారు. సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా సభలో శ్వేత పత్రాలను విడుదల చేసేలా అధికార పక్షం ప్రతిపాదించింది. కాగా బీఏసీ సమావేశానికి వైసీపీ సభ్యులు గైర్హాజరు అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గత సమావేశాల వరకూ గవర్నర్‌ను అసెంబ్లీకి దొడ్డిదారిన తెచ్చినట్లుగా చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం విూడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ… ఈ 

సమావేశాలకు గవర్నర్‌ను రాచమార్గంలో ముందు వైపు నుంచీ తీసుకొచ్చామన్నారు. అసెంబ్లీకి రాచమార్గం ఉండాలనే గోడ కూల్చి గేట్‌`2 తలుపులు తీశామని తెలిపారు. నలుగురు ప్యానల్‌ స్పీకర్లను పెట్టుకోమని సీఎం సూచించారన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు జరుగుతాయన్నారు. రెండుబిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు బిల్లుతో పాటు ఆరోగ్య విశ్వవిద్యాలయాని కి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణ బిల్లు కూడా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశ పెట్టనుందని తెలిపారు. 88మంది మొదటిసారి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్నందున వచ్చే సమావేశాల్లోపు వారికి శిక్షణ ఇస్తామన్నారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 80 శాతం మేర పూర్తయ్యాని అన్నారు. ఆరు నెలల్లోగా వాటిని సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తొమ్మిది నెలల్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వెల్లడిరచారు. కాగా.. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే ఉయయసభలను ఉద్దేశించిన గవర్నర్‌ నజీర్‌ ప్రసంగించారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం