
కాకినాడ, జూలై 06 : స్వయంభు కాకినాడ భోగిగణపతి పీఠంలో శ్రీవారి శత జపయజ్ఞ నిర్వహణ సందర్భంగా శనివారం ఉదయం తిరుమల గోవింద నామ పారాయణ ప్రతులను ఆవిష్కరించారు. 38వ జపయజ్ఞ పారాయణలో ముత్తయిదువులకు అమ్మవారి రవికతో తాంబూలాలందజేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పీఠంలో శ్రీవారి పాదాల వద్ద శత జపయజ్ఞం సందర్భంగా శ్రీదేవిభూదేవిసమేత వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుందన్నారు. 7శనివారాలు ఆవు నెయ్యితో దీపారాధన, గోవింద నామాల పారాయణ చేసిన శ్రీవారి భక్తులకు కల్యాణోత్సవంలో చీర రవికలతో పసుపు, కుంకుమలు అందుకుంటారని తెలియజేశారు.