ఎన్డీయేకి గుడ్‌బై చెప్పిన ఓ.పి. ఎస్ – స్టాలిన్‌తో చర్చలు, తమిళ రాజకీయాల్లో కొత్త ఉలికిపాటు

టీ నగర్ న్యూస్:తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సంచలనం రేకెత్తింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం (ఓ.పి. ఎస్) ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పారు. ఈ నిర్ణయాన్ని మాజీ మంత్రి రామచంద్రన్ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రకటన సమయంలో ఓ.పి.எస్‌ కూడా అక్కడే ఉండటం, ఆయన వ్యక్తిగతంగా ఏ అంశాలపై స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సమీప కాలంలో ఓ.పి. ఎస్ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మార్నింగ్ వాక్ సమయంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయ భవిష్యత్తు దిశగా పలు అంశాలపై చర్చలు జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీయేతో సంబంధాలు పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించడం కీలక పరిణామంగా నిలిచింది.

ఇదిలా ఉండగా, ఇటీవల సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగంతో ఓ.పి. ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఓ.పి. ఎస్ “కాలమే చెబుతుంది” అనే సమాధానంతో సర్దేశారు.

ఓ.పి. ఎస్ గతంలో ఏఐఏడీఎంకేలో కీలక నాయకుడిగా వ్యవహరించగా, పార్టీ అంతర్గత గొడవల వల్ల ఆయన బహిష్కరణకు గురయ్యారు. అనంతరం స్వతంత్రంగా తన వర్గాన్ని నిర్మించుకున్న ఆయన, ఇప్పుడు ఎన్డీయే నుంచి కూడా బయటకు రావడం.. 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.

………

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం