చెన్నై చేరిన పవన్ కళ్యాణ్ – జమిలి ఎన్నికలపై కీలక సదస్సు

చెన్నై న్యూస్:వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలుకు దక్షిణ భారతంలో ప్రాధాన్యతగల చర్చకు చెన్నై వేదికైంది. బీజేపీ తమిళనాడు శాఖ ఏర్పాటు చేసిన ఈ సదస్సు తిరువాన్మియూర్‌లోని రామచంద్ర కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయనను చెన్నై ఎయిర్‌పోర్టులో బీజేపీ నేతలు ఘనంగా స్వాగతించారు.

ఈ సదస్సులో బీజేపీ నేతలు తమిళిసై సౌందరరాజన్, నయనార్ నాగేంద్రన్, అనిల్ ఆంటోనీ, అరవింద్ మీనన్ తదితరులు పాల్గొన్నారు. జమిలి ఎన్నికలపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్ని స్థాయిల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న కేంద్ర ప్రణాళికపై చర్చించేందుకు కేంద్రం ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది.

ఇది అమలైతే 2027లో దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నట్లు అంచనా. గతంలో 1951-1967 మధ్య ఇది సాధ్యమైనప్పటికీ, ప్రస్తుతం మళ్లీ అదే విధానం వైపు కేంద్రం అడుగులు వేస్తోంది.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం