చెన్నై చేరిన పవన్ కళ్యాణ్ – జమిలి ఎన్నికలపై కీలక సదస్సు

చెన్నై న్యూస్:వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలుకు దక్షిణ భారతంలో ప్రాధాన్యతగల చర్చకు చెన్నై వేదికైంది. బీజేపీ తమిళనాడు శాఖ ఏర్పాటు చేసిన ఈ సదస్సు తిరువాన్మియూర్‌లోని రామచంద్ర కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయనను చెన్నై ఎయిర్‌పోర్టులో బీజేపీ నేతలు ఘనంగా స్వాగతించారు.

ఈ సదస్సులో బీజేపీ నేతలు తమిళిసై సౌందరరాజన్, నయనార్ నాగేంద్రన్, అనిల్ ఆంటోనీ, అరవింద్ మీనన్ తదితరులు పాల్గొన్నారు. జమిలి ఎన్నికలపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్ని స్థాయిల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న కేంద్ర ప్రణాళికపై చర్చించేందుకు కేంద్రం ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది.

ఇది అమలైతే 2027లో దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నట్లు అంచనా. గతంలో 1951-1967 మధ్య ఇది సాధ్యమైనప్పటికీ, ప్రస్తుతం మళ్లీ అదే విధానం వైపు కేంద్రం అడుగులు వేస్తోంది.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి