నమక్కల్: లారీ-బస్సు ఢీ – ముగ్గురు మృతి, 10 మందికి పైగా గాయాలు

గిండి న్యూస్ :నమక్కల్ జిల్లా మెటాల సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మెటళ్ల కొరియాట్టు వంతెనపై వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో లారీ డ్రైవర్‌, బస్సు డ్రైవర్‌, ఒక మహిళ అక్కడికక్కడే మరణించారు. 10 మందికి పైగా వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడినవారిని రాశిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎక్కువగా గాయపడిన బాధితులను మంత్రి మదివేంధన్ ఆసుపత్రిలో స్వయంగా కలుసుకుని, వారికి అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం