తిరుమలకు పాదయాత్ర ప్రారంభం

విల్లివాకం న్యూస్: చెన్నై, పెరంబూర్, పటేల్ రోడ్డులో గల శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్ర ఆదివారం ఆనంద నిలయం నుంచి ప్రారంభమయింది. 47వ సంవత్సరంగా ఏర్పాటైన ఈ పాదయాత్ర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త జంబు పాల్గొని ప్రారంభించారు. ప్రత్యేక అతిథులుగా పుదుచ్చేరి ఎమ్మెల్యే శివశంకర్, పారిశ్రామికవేత్త కిల్లి వళవన్ పాల్గొన్నారు. ఈ పాదయాత్ర రెడ్ హిల్స్, పెరియపాలయం, ఊత్తుకోట, సురుటుపల్లి నాగలాపురం, నారాయణవనం, పుత్తూరు, తిరుచానూరు మీదుగా సాగి తిరుమల 17వ తేదీ ఉదయానికి చేరుకుంటుంది. ఈ పాదయాత్రలో సమాజం అధ్యక్షులు తమ్మినేని బాబు, కార్యదర్శి ఎస్ వెంకట్రామన్, సహకార్యదర్శి హెచ్ అనంతరామన్, కోశాధికారి పి కోదండరామన్, ట్రస్టీ పి రామచంద్రన్ సహా దాదాపు మహిళలు, పురుషులు 300 మంది పాల్గొన్నారు. అలాగే పాండిచ్చేరికి చెందిన భక్తులు పదిమంది పాల్గొన్నారు.

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం