జలభారత దర్శనం.. చిత్రాన్ని విడుదల చేసిన జలవనరుల శాఖ

        చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని వాణి విలాస సాగరను పైనుంచి చూస్తే భారతదేశ పటంలా దర్శనమిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని జలవనరుల శాఖ విడుదల చేసింది. తాజాగా నీటి గలగలలతో.. చుట్టూ అటవీ పచ్చదనంతో ఆ ప్రాంతం కనువిందుగా మారింది. కృష్ణా జలభాగ్య పథకంలో భాగంగా ఈ జలాశయాన్ని నిర్వహిస్తున్నారు. మైసూరు రాజు నాల్వడి కృష్ణ రాజ ఒడెయరు తన తల్లి కెంప నంజమ్మణి వాణి విలాస పేరిట వేదావతి నదికి అడ్డుగా ఈ ఆనకట్టను నిర్మించారు. నిర్మాణ పనులు 1898లో ప్రారంభించి 1907లో పూర్తి చేశారు. చిత్రదుర్గతో పాటు తుమకూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలకు ఈ జలాశయం నుంచి నీరు అందిస్తున్నారు. ఈ జలాశయంలో 30 టీఎంసీల నీటిని నిలువ ఉంచవచ్చు. వర్షపాతం తక్కువగా ఉండడంతో ఇటీవలి ఏడాదుల్లో జలాశయంలో 22 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. రానున్న రోజుల్లో భర్తీ అయ్యే అవకాశాలున్నాయి

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి