
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో స్థానిక రైతు భరోసా కార్యాలయంలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు కార్యాలయం వెనుక వైపు తలుపులను పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఒక ఎల్ఈడి టీవీ. ఐదు సీలింగ్ ఫ్యాన్లు. గ్యాస్ సిలిండర్.పోయ్యు ని దొంగలించటం జరిగింది.ఈరోజు ఉదయం కార్యాలయం సిబ్బంది తలుపులు తెరవగా వెనక వైపు డోరు తెరిచి ఉండటంతో విషయాన్ని గుర్తించి వెంటనే బేస్తవారిపేట ఎస్సై నరసింహారావుకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.దొంగలించిన వారు బెస్తర పేట మండల పరిధిలో గ్రామాలలో ఇద్దరు వ్యక్తులు హిందీలో మాట్లాడుతూ పివిపురం ఎస్సీ పాలెం కు వెళ్లి టీవీ ని అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో ఎస్ఐ నరసింహారావు తమ సిబ్బందితో గ్రామాలకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.మార్కాపురం నుండి క్లూస్ టీం రంగప్రవేశం చేయటం జరిగింది.బేస్తవారిపేట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ జె మెర్సీ రాణి మాట్లాడుతూ కార్యాలయంలో దొంగిలించిన వారు నార్త్ ప్రాంతముకు చెందినవారుగా ఉండొచ్చని ప్రతినిధులతో తెలిపారు