చెన్నై సంగమం 2026తో పొంగల్ ఉత్సవాలు ప్రారంభం

పొంగల్ పండుగ సందర్భంగా ఎంపీ కనిమొళి నిర్వహించే ‘చెన్నై సంగమం – నమ్మ ఊరు ఉత్సవం’ ప్రతి ఏడాది ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. ఈ ఏడాది చెన్నైలోని ఎగ్మోర్ రాజరత్నం క్రీడా మైదానంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రత్యేక అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ ఉత్సవాల్లో తమిళనాడులోని పలు జిల్లాల నుంచి ఎంపికైన 1500 మందికి పైగా కళాకారులు నయ్యాండి మేళం, కరకట్టం, కావడియాట్టం, పురవియాట్టం, ఇరియాననం వంటి సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. అలాగే తప్పాట్టం, తుడుంపాట్టం, పంపాయాట్టం, కైశిలంబాట్టం, ఒయిలాట్టం, దేవరాట్టం, సేవాయాట్టం వంటి కళా ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా చెన్నై సంగమం కలైవిజలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మాట్లాడుతూ, పొంగల్‌ను సంప్రదాయ కళల ఉత్సవంతో జరుపుకోవడం ఆనందకరమని తెలిపారు.
ఈ విషయమై ఆయన తన X (ట్విట్టర్) పోస్ట్లో,
“డ్రమ్స్ మ్రోగాయి, భూమి కంపించింది… చెన్నై సంగమం #ChennaiSangamam2026 ప్రారంభమైంది” అని పేర్కొన్నారు.
మన దేశ సంప్రదాయ కళలు, కళాకారులను గౌరవించే ఈ చెన్నై సంగమం కలైవిజతో పొంగల్‌ను ఘనంగా జరుపుకుందాం. నిజమైన శ్రద్ధతో, ప్రతి ఏడాది ఈ ఉత్సవాన్ని మరింత ప్రత్యేకంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం