ఆకట్టుకున్న ‘కిన్నెరసాని’ నృత్య నాటిక

విల్లివాకం న్యూస్: దుర్గా స్రవంతి సాంస్కృతిక విభాగం, దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా సభ, చెన్నై ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటైన విశ్వనాథ సత్యనారాయణ ‘కిన్నెరసాని’ నృత్యనాటిక ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంది. మధుర కళానికేతన్ నృత్య బృందం స్థాపకులు, నాట్య గురువు కళారత్న డాక్టర్ మాధవి మల్లంపల్లి, (సినీ నటుడు చంద్రమోహన్, రచయిత్రి జలంధర కుమార్తె) ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన జరిగింది. దీనికి మైలాపూర్ లోని ఆంధ్ర మహిళా సభ హాలు వేదికయింది. ముందుగా ప్రార్థన గీతాన్ని వసుంధర ఆలపించారు. స్వాగతోపన్యాసం భారతి చేశారు. దామెర్ల సరస్వతి కళాకారులను పరిచయం గావించారు. విశ్వనాథ వారిపై విశేషాలు లావణ్య చదివి వినిపించారు. కిన్నెరసాని కథ పత్రి అనురాధ, పాటలతో మాటల శైలిని ఎస్ పి వసంతలక్ష్మి సభకు తెలియజేశారు.
ఈ నృత్య ప్రదర్శనలో కళాకారులు డాక్టర్ మాధవి మల్లంపల్లి తోపాటు, డాక్టర్ భావన నారాయణన్, కుమారి లాస్య కానూరు, నితిన్ గణేష్
కుమారి శ్రీకరీ, అనుష్క, వైష్ణవి, తనుశ్రీ, దీపశిఖ, దియా పాల్గొన్నారు.

కార్యక్రమంలో చైర్ పర్సన్ ప్రేమధాత్రి, కార్యదర్శి భానుమతి, డి పద్మావతి, పి జయశ్రీ, లావణ్య శ్రీనివాస్, ఎస్పీ వసంత లక్ష్మి, సత్తిరాజు భారతి, ఆముక్త మాల్యాద, పి అనురాధ, డి సరస్వతి పాల్గొన్నారు. చివరిగా ఆముక్త మాల్యద వందన సమర్పణ చేశారు

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి