
తాడేపల్లిలోని తన బిల్డింగును వైఎస్ జగన్ ఆక్రమించుకున్నారని జరిగిన ప్రచారం అవాస్తమని టిడిపి నేత ఆది శేషగిరిరావు స్పష్టం చేశారు.
ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. మా అబ్బాయి చేసిన విల్లా ప్రాజెక్టులో జగన్ ఇల్లు, ఆఫీసు ఓ భాగం.
ఆ సైట్ చూసింది.. నిర్మించింది మేమే మార్కెట్ రేట్ ప్రకారం ఆయన కొనుగోలు చేశారు.
నిర్మాణ బిల్స్ అన్ని ఇచ్చారు.
సోషల్ మీడియాలో ఆయన పై కొందరు చేసిన ప్రచారం తప్పని’ అని పేర్కొన్నారు.