దేశ క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థన

టి నగర్ న్యూస్: దేశ క్షేమం, సరిహద్దులో సమాధానం, ఈసీఐ సంఘాల అభివృద్ధి, తదితర అంశాల కోసం ఈ సీఐ సౌత్ఆంధ్ర డయాసిస్ బిషప్ డాక్టర్ ఆర్కే ఏబేలు నీలకంఠ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం ఈసీఐ ప్రధాన కార్యాలయంలోని బిల్లీ గ్రహం ఆడిటోరియం, ఫాదర్ బిషప్ ఎజ్రా సర్గుణం ప్రార్ధించిన ప్రార్థన గోపురంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశ క్షేమం, సరిహద్దులో సమాధానం, ఈ సి ఐ సంఘాల అభివృద్ధి, ఐ ఎం ఎం సేవ, నూతన సంఘాల నిర్మాణం తదితర అంశాలపై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఐ ఎం ఎం డైరెక్టర్ రెవ వెస్లీ సత్య, బిషప్ కమీషనరీ రెవ డి సురేష్ నాథ్, డయాసిస్ ట్రెజరర్ రెవ వి యోహన్, సభ్యులు రెవ డి బాలరాజు, రెవ ఎం ఎన్ భూషణం, రెవ డి సిలువ, పాస్టర్ సిహెచ్ ముకుందరావు, తదితరులు పాల్గొని ప్రత్యేక పాటలు పాడి ,ప్రార్థనలు చేశారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి