నిస్వార్థ సేవకులకు సమాజంలో గుర్తింపు : డాక్టర్ గొల్లపల్లి ఇశ్రాయేల్

విల్లివాకం న్యూస్ : నిస్వార్థసేవలందించే వారికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని తమిళనాడు ఆది ఆంధ్ర అరుంధతీయ మహాసభ (టామ్స్) వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇశ్రాయేల్ వెల్లడించారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ సిఎస్, టామ్స్ ప్రధాన కార్యాలయ కార్యదర్శి సిఇ తిరుమల రావు 50వ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. చెన్నై వేపేరి లోని సాల్వేషన్ ఆర్మీ హెచ్ఆర్డి సెంటర్లో టామ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇశ్రాయేలు, టామ్స్ అధ్యక్షులు నేలటూరి విజయ్ కుమార్ లు సారథ్యం వహించారు. ఆహూతుల సమక్షంలో తిరుమల రావు కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు .ఈ సందర్భంగా గొల్లపల్లి ఇశ్రాయేల్ మాట్లాడుతూ నగర పురపాలక సంఘంలో అధికారిగా, టామ్స్ నిర్వాహకుడిగా తిరుమల రావు సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అన్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదనపు కార్యదర్శి గుర్రం చిన్న నాగూర్,
జిసిసి సీనియర్ రెవెన్యూ ఆఫీసర్ ఎం తిరుపాల్, అఖిల భారత తెలుగు సమాఖ్య, ప్రధాన కార్యదర్శి నాయకర్ ఆర్ నందగోపాల్, ఐజేకే నేత మన్నం రవిబాబు సహా టామ్స్, జనోదయం నిర్వాహకులు, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొని తిరుమల రావుకు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.


………………..

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి