ఏపీలో పుష్ప-2 టికెట్ ధరల పెంపు: ఫ్యాన్స్‌కు భారీ షాక్

అమరావతి: సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పుష్ప-2 విడుదలకు ముందే టికెట్ ధరల పెంపు పెద్ద చర్చగా మారింది. థియేటర్ యాజమాన్యాలు ప్రీమియర్ షోతో పాటు మొదటి రెండు వారాలపాటు టికెట్ ధరలను భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వ అనుమతిని పొందాయి.

ప్రీమియర్ షో టికెట్ ధరలు 800 రూపాయలకు?

డిసెంబర్ 4న రాత్రి 9:30కు ప్రదర్శించే పుష్ప-2 ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 800గా నిర్ణయించబడింది. అలాగే, డిసెంబర్ 5 నుంచి 17 వరకు రెండు వారాల పాటు మల్టీప్లెక్స్‌లలో రూ. 200, సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాస్ టికెట్‌కు రూ. 100, అప్‌పర్ క్లాస్ టికెట్‌కు రూ. 150 వరకు ధరలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.

ఇండస్ట్రీకి మేలు చేస్తుందనోనా..

ఈ నిర్ణయం నేపథ్యంలో పుష్ప-2 హీరో అల్లు అర్జున్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరింత అభివృద్ధి కలిగిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని పెద్ద చిత్రాలకు ఇది తోడ్పడుతుందని బన్నీ అభిప్రాయపడ్డాడు.

ఈ టికెట్ ధరల పెంపు వల్ల ప్రేక్షకులకు కొంత భారం అయినప్పటికీ, పెద్ద సినిమాల బడ్జెట్‌లు అందరికీ చేరవడంలో ఇది కీలకంగా మారనుంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి