చెస్ చరిత్ర సృష్టించిన గుకేశ్‌కు ప్రధాని మోదీ అభినందనలు

చెన్నై న్యూస్:సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల గుకేశ్, చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను (7.5 – 6.5 పాయింట్లు) ఓడించి విజేతగా నిలిచాడు. దీని ద్వారా గుకేశ్ ప్రపంచ చెస్ చరిత్రలో ఈ టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.

గుకేశ్‌కు రూ.11½ కోట్ల ప్రైజ్ మనీతో పాటు ప్రైజ్ ట్రోఫీ, మెడల్ లభించాయి. అంతేకాక, తమిళనాడు ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల ప్రైజ్ మనీని కూడా ప్రకటించారు.

పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు గుకేశ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ గుకేశ్‌కు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

ఫైనల్ మ్యాచ్‌లో డింగ్ లిరెన్ సంతకం చేసిన చెస్ బోర్డును గుకేశ్ ప్రధాని మోదీకి సావనీర్‌గా బహూకరించాడు.

దీనికి సంబంధించిన ట్వీట్‌లో, PM మోదీ తన X (మాజీ ట్విట్టర్) ఖాతాలో, “చెస్ ఛాంపియన్ గుకేశ్ భారతదేశం గర్వించే వ్యక్తి. నేను అతనితో కొన్ని సంవత్సరాలుగా సన్నిహితంగా ఉన్నాను. అతని సంకల్పం, నిబద్ధత అద్భుతం. కొన్ని సంవత్సరాల క్రితం అతను ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా పిన్న వయస్కుడిగా అవతరించగలడని చెప్పడం గుర్తుంది. అతని కృషితో ఆ అంచనా నిజమైంది,” అంటూ పేర్కొన్నారు.

 

గుకేశ్ విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి