అంబేద్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలపై అమిత్ షా క్షమాపణ కోరుతూ విపక్షాల నిరసన

న్యూఢిల్లీ ప్రతినిధి: లోక్‌సభలో “ఒకే దేశం, ఒకే ఎన్నికలు” బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో పార్లమెంటు రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఎంపీలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై నిరసనగా విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. బ్యానర్లు పట్టుకుని, నినాదాలు చేస్తూ అమిత్ షా క్షమాపణలు చెప్పాలని, పదవీత్యాగం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసనలో ఇండియా అలయన్స్ సభ్యులు, ప్రియాంక గాంధీ సహా అనేక మంది ఎంపీలు పాల్గొన్నారు. అమిత్ షా పార్లమెంట్‌కు చేరుకునే సమయంలో ఆయన కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో అమిత్ షా కారు పార్లమెంట్ చుట్టూ రెండు సార్లు తిరిగినట్లు సమాచారం.

నిరసనల సమయంలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్‌పుత్ గాయపడగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి