జలభారత దర్శనం.. చిత్రాన్ని విడుదల చేసిన జలవనరుల శాఖ

        చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని వాణి విలాస సాగరను పైనుంచి చూస్తే భారతదేశ పటంలా దర్శనమిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని జలవనరుల శాఖ విడుదల చేసింది. తాజాగా నీటి గలగలలతో.. చుట్టూ అటవీ పచ్చదనంతో ఆ ప్రాంతం కనువిందుగా మారింది. కృష్ణా జలభాగ్య పథకంలో భాగంగా ఈ జలాశయాన్ని నిర్వహిస్తున్నారు. మైసూరు రాజు నాల్వడి కృష్ణ రాజ ఒడెయరు తన తల్లి కెంప నంజమ్మణి వాణి విలాస పేరిట వేదావతి నదికి అడ్డుగా ఈ ఆనకట్టను నిర్మించారు. నిర్మాణ పనులు 1898లో ప్రారంభించి 1907లో పూర్తి చేశారు. చిత్రదుర్గతో పాటు తుమకూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలకు ఈ జలాశయం నుంచి నీరు అందిస్తున్నారు. ఈ జలాశయంలో 30 టీఎంసీల నీటిని నిలువ ఉంచవచ్చు. వర్షపాతం తక్కువగా ఉండడంతో ఇటీవలి ఏడాదుల్లో జలాశయంలో 22 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. రానున్న రోజుల్లో భర్తీ అయ్యే అవకాశాలున్నాయి

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి