జలభారత దర్శనం.. చిత్రాన్ని విడుదల చేసిన జలవనరుల శాఖ

        చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని వాణి విలాస సాగరను పైనుంచి చూస్తే భారతదేశ పటంలా దర్శనమిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని జలవనరుల శాఖ విడుదల చేసింది. తాజాగా నీటి గలగలలతో.. చుట్టూ అటవీ పచ్చదనంతో ఆ ప్రాంతం కనువిందుగా మారింది. కృష్ణా జలభాగ్య పథకంలో భాగంగా ఈ జలాశయాన్ని నిర్వహిస్తున్నారు. మైసూరు రాజు నాల్వడి కృష్ణ రాజ ఒడెయరు తన తల్లి కెంప నంజమ్మణి వాణి విలాస పేరిట వేదావతి నదికి అడ్డుగా ఈ ఆనకట్టను నిర్మించారు. నిర్మాణ పనులు 1898లో ప్రారంభించి 1907లో పూర్తి చేశారు. చిత్రదుర్గతో పాటు తుమకూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలకు ఈ జలాశయం నుంచి నీరు అందిస్తున్నారు. ఈ జలాశయంలో 30 టీఎంసీల నీటిని నిలువ ఉంచవచ్చు. వర్షపాతం తక్కువగా ఉండడంతో ఇటీవలి ఏడాదుల్లో జలాశయంలో 22 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. రానున్న రోజుల్లో భర్తీ అయ్యే అవకాశాలున్నాయి

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం