భారత్ ఘన విజయం – పాక్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న 17వ ఆసియా కప్‌లో భారత్ పాక్‌పై అద్భుత విజయం సాధించింది. దుబాయ్‌లో జరిగిన 6వ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. సాహిబ్‌జాదా బుర్హాన్ 40 పరుగులు చేసినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి పాక్ 127 పరుగులకే పరిమితమైంది. భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, బుమ్రా మరియు అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీశారు.

128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ మైదానంలోకి దిగారు. గిల్ 10 పరుగులు చేసినప్పటికీ, అభిషేక్ 31, తిలక్ వర్మ 31 పరుగులతో జట్టుకు సహకరించారు. చివరగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, శివమ్ దూబే (10*) తో కలసి భారత్‌కు విజయాన్ని అందించాడు.

భారత్ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం