
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో గెలిచిన టీమ్ ఇండియా వరుసగా రెండోసారి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజు సామ్సన్ 46 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చాడు. ఇషాన్ కిషన్ 54 పరుగులు, అభిషేక్ శర్మ 52 పరుగులతో కీలక పాత్ర పోషించారు. చివర్లో శివం దుబే వేగంగా 26 పరుగులు జోడించాడు. న్యూజిలాండ్ తరఫున జేమ్స్ నీషమ్ 3 వికెట్లు తీశాడు.
256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల దాడికి నిలువలేకపోయింది. టిమ్ సైబర్ట్ 52 పరుగులు, కెప్టెన్ సాంట్నర్ 43 పరుగులు చేసినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివరికి న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత్ తరఫున బుమ్రా 4 వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలకంగా నిలిచారు. దీంతో భారత్ టి20 ప్రపంచకప్ ట్రోఫీని మరోసారి తన ఖాతాలో వేసుకుంది. 🏆🇮🇳
……….