అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు పై కృతజ్ఞతలు

చెన్నై న్యూస్:ఆంధ్ర రాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలుగు ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన ఈ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న ధర్నా చౌక్ వద్ద గతంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో విగ్రహ స్థాపన డిమాండ్ కూడా ఒక ముఖ్య అంశంగా ఉన్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఉంచిన ఇతర సమస్యలను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించిందని పేర్కొన్నారు.
అమరావతిలో 58 అడుగుల ఎత్తులో “స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్”గా పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయనకు నిజమైన నివాళిగా అభివర్ణించారు. తెలుగు ప్రజల హక్కుల సాధన కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తెలిపారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG_20260317_123355
అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు పై కృతజ్ఞతలు
IMG-20260316-WA0085
ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు
Screenshot_20260315_175152
ఏప్రిల్ 23న తమిళనాడులో అసెంబ్లీ పోలింగ్
Screenshot_20260314_162636
హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన రెండు భారతీయ LPG ట్యాంకర్లు
Screenshot_20260314_114610
అహంకారం లేదు.. పోటీ భావన లేదు: అనిఖా

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి