జానపద గాయకురాలి జాడ ఒక సినిమా పాటతో మార్మోగిన ప్రశంసలు

కోడంబాక్కం న్యూస్: ప్రముఖ హీరో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రంలో “ఊ అంటావా మావా… ఉహూ అంటావా” పాటతో నూతన గాయని ఇంద్రావతి చౌహాన్‌ను పరిచయం చేసిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ‘పుష్ప 2’ లో మరో కొత్త గాయనికి అవకాశం ఇచ్చారు.

ఈ సారిగా దాస లక్ష్మి అనే గాయని పాటల ప్రియులను తన గొంతుతో మంత్రముగ్ధుల్ని చేసింది. ‘పుష్ప 2’ లోని “వస్తుండాయి పీలింగ్స్‌” అనే పాట ఆమె పాటల ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించింది. దాస లక్ష్మి తెలంగాణలోని నిర్మల్ జిల్లా, ముథోల్ మండలం గన్నోర గ్రామానికి చెందినవారు.

చిన్ననాటి నుంచి ఆమె తల్లి జయశీల పాడే మరాఠీ కీర్తనలను అనుకరిస్తూ తెలుగులో జానపద పాటలు పాడడం ప్రారంభించింది. ఆమె ప్రతిభను గుర్తించిన గ్రామస్థుడు దిగంబర్ సంగీతం మీద మెళకువలు నేర్పించాడు. జానపద గీతాలను పాడుతూ వివిధ ప్రదర్శనల ద్వారా దాస లక్ష్మి అందరి మనసులు గెలుచుకుంది.

యూట్యూబ్‌లో ఆమె పాడిన 700కి పైగా జానపద పాటలు సంగీత ప్రియులను ఆకర్షించాయి. ఈ ప్రభావంతోనే దేవిశ్రీ ప్రసాద్ ఆమెను ‘పుష్ప 2’ లో అవకాశం కల్పించారు. ఆమె పాడిన “వస్తుండాయి పీలింగ్స్‌” పాట రికార్డుల స్థాయిలో వైరల్ అవ్వడంతో దాస లక్ష్మి పేరు తెలుగునాట మార్మోగుతోంది.

ఈ పాట విజయం దాస లక్ష్మికి మాత్రమే కాకుండా, ఆమె ఊరికి గర్వకారణం అయింది. నిర్మల్ జిల్లా ప్రముఖులు ఆమె ప్రతిభకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

జానపద గీతాల ప్రపంచంలో దాస లక్ష్మి బాట… ఒక సూపర్‌హిట్‌ కథ

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం