
విళ్లివాకం న్యూస్ : చెన్నై నగరంలోని ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫిషనల్స్ అసోసియేషన్ (అవోపా) తమిళనాడు ఆధ్వర్యంలో చెన్నై టి.నగర్ లోని ఆస్కాలో ఆదివారం నిర్వహించిన సర్వసభ్య మండలి సమావేశంలో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు విద్యా ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. అవోపా తమిళనాడు అధ్యక్షులు తాడేపల్లి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతనంగా సీనియర్ సిటిజన్, సెమినార్, మెంబర్షిప్ తదితర పేర్లతో 10 కమిటీలను ఎంపిక చేశారు. అలాగే అవోపా తరపున 16 మంది విద్యార్థులకు విద్యా ఉపకార వేతనంగా తలా రూ.25 వేల చొప్పున పంపిణీ చేశారు. ఆర్యవైశ్య చారిటబుల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, తమిళనాడు తరపున ప్రెసిడెంట్ రాజశేఖర్ కు అప్రిసియేషన్ మెమొంటో అందజేశారు.
ఈ సందర్భంగా తాడేపల్లి రాజశేఖర్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్, ఐటీ, సీఏ తదితర ప్రొఫిషనల్ కోర్సులు చదువుతున్న మెరిటోరియల్ విద్యార్థులను ప్రోత్సహించేలా విద్యా ఉపకార వేతనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. నాలుగు సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే 40యేళ్లు సుఖపడతారని ఆయన విద్యార్థులకు సూచించారు. అవోపా శాఖలను విస్తరింపజేయడం వల్ల మరిన్ని సేవా, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేలా తనవంతు కృషిచేయనున్నట్లు ఆయన తెలిపారు. వామ్ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ సైతం పాల్గొని అవోపా కార్యక్రమాలకు వామ్ కార్యాలయాన్ని ఉచితంగా వినియోగించుకోవచ్చు అని చెప్పటంపై సంతోషంగా ఉందన్నారు.
ప్రేమ్ ఫార్మా కుమార వేలు నలుగురు స్టూడెంట్స్ కు లక్ష రూపాయలు అందజేశారు. రాజశేఖర్ రూ. 50 వేలను ఇద్దరు స్టూడెంట్స్ కు అందజేశారు. మిగిలిన డోనర్స్ ఒక్కో స్టూడెంట్ కు తలా 25 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సి. రంగనాథన్ శెట్టి, టీజీ శేఖర్, ఎ.సుధాకర్, అపోలో సుబ్రహ్మణ్యం, టీజీ శ్రీనివాసన్, కనిగెలుపుల రాధాకృష్ణమూర్తి, డా.ఎంవీ నారాయణగుప్తా, కేఎన్ సురేష్ బాబు, పొన్నూరు రంగనాయకులు, ఆశిష్ తాడేపల్లి, జగదీష్ బాబు, జెవి రమణ, ఇమ్మిడి కిషోర్, నాగసురేష్, డోనర్స్, స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
……………….