
చెన్నై న్యూస్ :ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ భారీ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని 152 ఓట్ల తేడాతో ఓడించారు.
రాధాకృష్ణన్కు 452 ఓట్లు లభించగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లని ఓట్లుగా తేలాయి.
పార్లమెంటులోని 781 మంది ఎంపీలలో 767 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు దూరంగా నిలిచాయి.