
* సంప్రదింపులకమిటీ కమిటీ సమావేశంలో వినతి
తిరువల్లూరు న్యూస్ , తిరువల్లూరు జిల్లాలోని సేవాపెటై రైల్వే స్టేషన్లో తాగునీరు, మరుగుదొడ్లు సహా ప్రాథమిక సౌకర్యాలను వెంటనే కల్పించాలని సంప్రదింపుల కమిటీ కమిటీ సభ్యులు అధికారులను కోరారు . శుక్రవారం సేవాపెట్టై రైల్వే స్టేషన్ సంప్రదింపులకమిటీ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. స్టేషన్ ఆఫీసర్ దివాకర్, దాస్ విక్టర్ రాజ్, జూనియర్ ఇంజనీర్ గజేంద్రన్ మరియు సలహా కమిటీ సభ్యులు కోనేటి వెంకటేశ్వర్లు, రమణి, రిషికేశ్, , బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో , సంప్రదిపుల కమిటీ సభ్యులు స్టేషన్ అధికారికి వివిధ డిమాండ్లను అందించారు. రైల్వే ఓవర్పాస్ పనులు నిలిచిపోవడంతో, ప్రజా రవాణా కోసం సొరంగం నిర్మించాలి. సేవ్వాపేట రైల్వే స్టేషన్లో తాగునీరు, మరుగుదొడ్లు సహా ప్రాథమిక వసతులు కల్పించాలి. వై-ఫై ‘డి;సదుపాయం , సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. రాత్రిపూట రైల్వే స్టేషన్లో పోలీసులు గస్తీ తిరగాలి. రెండవ ప్లాట్ఫారమ్లోని దెబ్బతిన్న సీట్లను మార్చాలి. పట్టాలు దాటేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఒక ప్రాంతంలో మాత్రమే ఏర్పాటు చేసే వార్నింగ్ బెల్ ను ముందు భాగంలో కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే ఫ్లైఓవర్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచాలని కూడా వారు డిమాండ్ చేశారు.
సలహా కమిటీ సభ్యులు చేసిన డిమాండ్లన్నింటినీ రైల్వే శాఖలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కనుగొంటామని రైల్వే అధికారులు తెలిపారు.
………..